13, అక్టోబర్ 2009, మంగళవారం

స్వామి వివేకానంద

1. ఒక దేశంలో మనుష్యులు ఎంత గొప్పవారైతే, ఆ దేశం అంత గొప్పదవుతుంది. ఒక దేశం దిగజారి పోయిందంటే దానికి అర్ధం ఆ సమాజం గొప్ప వ్యక్తులను తయారు చెయ్యలేక పోతోందనే.

2. ప్రతీదీ కావాలనుకునే వాడు దేనినీ పొందలేడు.

3. తల్లిని ఆరాధించని వ్యక్తి ఉన్నతి పొందలేడు. నా ధీశక్తి యావత్తుకూ కారకురాలు నా తల్లే.

4. అదృష్టమనేది ఒక లాటరీ వంటిది. నీవు దానిని కోరినప్పుడు అది నిన్ను విడిచి పారిపోతుంది. నీవు దాని పట్ల విముఖత చూపినప్పుడు అది నిన్ను కౌగలించుకుంటుంది.

5. మనలను యదార్ధమైన మనిషిగా రూపొందించడానికి అవసరమైన విచక్షణా జ్ఞానమూ, సమాజ శ్రేయస్సు కోసం కావలసిన చైతన్యాలను అందించే తత్వమూ, మతమూ నేడు అవసరం.

6. మీ రక్త నాళాలలో ప్రవహిస్తున్నది గొప్ప మహర్షుల రక్తం అని మీరెల్లప్పుడూ గుర్తుంచుకోండి.

7. ఎన్ని అవరోధాలెదురైనా అనుకున్న పని మీద నుంచి దృష్టి మరలిపోకుండా పనిచేయగలిగిన వాడి వ్యక్తిత్వమే ఉన్నతమైనది.

8. పౌరుషంతో పనిచెయ్యనప్పుడు ఎంతమంది దేవుళ్ళనుంచి ఎంత సహాయం అందినా అది మీలోని జడత్వాన్ని, సోమరితనాన్ని వదిలించలేవు.

9. నిజానికి జీవితం అంటే ఇవ్వడమే గానీ, తీసుకోవడం కాదు.

10. సరిగా మాట్లాడటాన్ని నేర్చుకోవడమే, వ్యక్తిత్వ నిర్మాణంలో అతి ముఖ్యమైన అంశం.

11. ఏది ఏమైనా మనిషి స్వభావంలో ఒక గప్ప అపాయం ఉంది. అదేమంటే, మనిషి ఎప్పటికీ తనను తాను పరీక్షించుకోకపోవటమే.

12. కోపం మహా పాపం. అది ఒక్కోసారి ధర్మబద్ధంగా కనిపించినా సరే, కోపం అనేది అన్ని రూపాలలోనూ పాపమే.

13. బాధ్యత అంతా మీ భుజాలమీదే ఉందని అనుకోండి. అప్పుడే మీరు అత్యుత్తమంగా పనిచేయగలుగుతారు.

14. ఏ వ్యక్తి అయితే తానున్న కాలానికంటే సుదూరమైన భవిష్యత్తులోకి తొంగి చూస్తాడో, దానికి తగినట్టుగా ఆలోచించి పనిచేస్తారో, అటువంటి వాడు మాత్రమే గొప్ప కార్యాలు సాధించగలుగుతాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి